WarangalVoice
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 1:36 pm Digital Edition : Ravi Goli

అభివృద్ధి బాటలో ఇల్లందకుంట

5వ వార్డులో తీరిన తాగునీటి కష్టాలు

వరంగల్ వాయిస్, ఇల్లందకుంట : మండల కేంద్రమైన ఇల్లందకుంట గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 5వ వార్డులో దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. వార్డు మెంబర్ దయ్యాల లక్ష్మి (రంజిత్) చొరవతో, గ్రామ పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన కొత్త బోర్ మోటార్‌ను ఆదివారం ప్రారంభించారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వార్డులోని ప్రతి ఇంటికీ శుద్ధమైన నీరు అందాలనే లక్ష్యంతో ఈ బోర్ మోటార్‌ను విజయవంతంగా ఏర్పాటు చేశారు. గతంలో నీటి కోసం ఇబ్బందులు పడ్డ స్థానికులు, ఇప్పుడు తమ ఇంటి ముందే నీటి సౌకర్యం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా గ్రామ పంచాయతీ పని చేస్తోందని ఈ సందర్భంగా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దారా సురేష్, 5వ వార్డు మెంబర్ దయ్యాల లక్ష్మి (రంజిత్) పాల్గొని పనులను పర్యవేక్షించారు. భవిష్యత్తులో కూడా వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పల్లెర్ల శ్రీకాంత్, పెద్ది శంకర్, దంసాని శ్రీదర్, కాచు రాజయ్య, సాని సంపత్, కమల్ల కొమురయ్య, పెద్ది శివ తదితరులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.