WarangalVoice
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 1:39 pm Digital Edition : Ravi Goli

వరంగల్ కమిషనరేట్‌లో ఎస్సైల బదిలీలు..

9 మందికి స్థానచలనం..

ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సన్‌ప్రీత్ సింగ్

వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం మరియు విధి నిర్వహణలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని సీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.