Monday, August 17, 2026
HomeMuluguనేడు సీఎం రేవంత్ రెడ్డి రాకతో ముస్తాబైన మేడారం...

నేడు సీఎం రేవంత్ రెడ్డి రాకతో ముస్తాబైన మేడారం…

📰 Generate e-Paper Clip

వనదేవతల సన్నిధిలో సీఎం ప్రత్యేక పూజలు…

ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ వాయిస్, ములుగు : నేడు సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా లో పర్యటన నేపథ్యంలో సీఎం ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకొని మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకొని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించనున్నారు.అనంతరం మేడారం సన్నిధిలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం, ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.సీఎం రాకతో అధికారులు ఆలయ ప్రాంగణం, వనదేవతల గద్దెలకు వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. పోలీసులు బారికేడింగ్‌తో కట్టుదిట్టమైన బంద బస్త్ ఏర్పాట్లు చేసి హెలిప్యాడ్ నుంచి వనదేవతల ప్రాంగణం వరకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.

 

RELATED ARTICLES

Most Popular