వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామెర మండల సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్ గురువారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హన్మకొండలోని చల్లా ధర్మారెడ్డి నివాసంలో పలువురు సర్పంచులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడు దుబాసి నవీన్ను చల్లా ధర్మారెడ్డి శాలువాతో సత్కరించి, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
