వరంగల్ వాయిస్, ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వంగాల రాజేంద్రప్రసాద్ మంగళవారంప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని ల్యాబ్ టెక్నీషియన్ గా ఉత్తమ సేవ అవార్డుని కలెక్టర్ చాహత్ వాజ్ పా యి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ మేరకు ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ అందుకున్నారు ఈ సందర్భంగా ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏ అప్పయ్య, క్షయ వ్యాధి నిర్మల నా అధికారి డాక్టర్ కే హిమబిందు రాజేంద్రప్రసాద్ ని అభినందించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అవార్డు ప్రధానం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
