Wednesday, September 16, 2026
HomeHanamkondaబాధిత కుటుంబాలకు చల్లా పరామర్శ

బాధిత కుటుంబాలకు చల్లా పరామర్శ

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, దామెర: పరకాల నియోజకవర్గం దామెర మండలం పులుకుర్తి గ్రామంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంగళవారం పర్యటించారు. ఇటీవల మృతిచెందిన మాదారపు రామచంద్రం, గోవిందు సరోజన, పాముల నీల కుటుంబాలను పరామర్శించి, మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.అదేవిధంగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యూత్ నాయకుడు మోరే చిరంజీవిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, జాకీర్, శంకర్, అశోక్, రాజు, కృష్ణమూర్తి, సాంబయ్య, సత్యనారాయణ రెడ్డి,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular